లవ్ స్టోరీ ఈవెంట్ కి చిరు, నాగ్

Nagarjuna and Chiru

నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల తీసిన మూవీ… లవ్ స్టోరీ. ఈ సినిమా ప్రచారం మళ్ళీ ఊపందుకొంది. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. దాంతో, మళ్లీ అగ్రెస్సివ్ గా ప్రొమోషన్లు మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా కింగ్ అతిథిలు రానున్నారు.

ఈ నెల 20న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మెయిన్ గెస్టులు. సాధారణంగా నాగ చైతన్య సినిమాలకు నాగార్జున అతిథిగా వస్తుంటారు. ఈసారి చిరంజీవి కూడా రానుండడం విశేషం.

ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పాటలన్నీ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల తీస్తున్న మూవీ కావడంతో అందరి చూపులు దీనిపైనే ఉన్నాయి. రెండో వేవ్ తర్వాత సినిమాల థియేటర్లకు జనాలు పెద్ద ఎత్తున రావడం లేదు. ఇప్పటివరకు సాలిడ్ హిట్ లేదు. ‘లవ్ స్టోరీ’ మళ్ళీ జనాలను థియేటర్లకు రప్పిస్తుందనే నమ్మకంతో ఉంది ట్రేడ్.

Advertisement
 

More

Related Stories