రెబెల్ స్టార్ కృష్ణంరాజుకి తన వారసుడు (సోదరుడి కుమారుడు) ప్రభాస్ తో నటించడం అంటే ఎంతో ఇష్టం. ప్రభాస్ విజయాన్ని చూసి ఆయన గర్వపడుతున్నారు. తాజాగా ప్రభాస్, కృష్ణంరాజు కలిసి ‘రాధేశ్యామ్’లో నటించారు. ఈ సినిమాలో పరమహంస అనే పాత్ర పోషించారు కృష్ణంరాజు. కథలో కీలకమైన పాత్ర.
ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు రెబెల్ స్టార్. ఇందులో పలు అంశాలు వెల్లడించారు ఆయన. “ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకొని పిల్లలను కంటే నాకు ఆనందం. వాళ్ళని నా చేతిలో ఆడించాలని ఉంది,” అని కృష్ణంరాజు తన కోరికని బయటపెట్టారు.
ఇక ప్రభాస్ నటించిన చిత్రాల్లో ‘వర్షం’ ఆల్ టైం ఫెవరిట్ అని చెప్పారు. అలాగే తన చిత్రాల్లో ప్రభాస్ కనుక నటించాల్సి వస్తే, ‘మనవూరి పాండవులు’ చిత్రాన్ని రీమేక్ చెయ్యమని కోరుతాను అంటున్నారు. వయసు పైబడడంతో కృష్ణంరాజు ప్రస్తుతం ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నారు.
కేవలం ప్రభాస్ తో మరోసారి నటించాలనే కోరికతో ‘రాధేశ్యామ్’లో పరమహంస పాత్ర పోషించారు.