తేజ్ యాక్సిడెంట్… వినాయక్ చెప్పిన ట్విస్ట్

సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం వెనుక అసలు కారణం ఏంటి? పోలీసులు ప్రాథమికంగా అతి వేగం అని నిర్ధారించారు. ఐతే, ప్రమాదం జరిగిన స్థలంలో రోడ్డుపై ఇసుక నిలిచినట్లు కూడా గుర్తించారు. ఇసుక కారణంగా సాయి తేజ్ బైక్ బ్యాలెన్స్ చేసుకోలేకపోయారనేది నిపుణల వాదన. ఐతే, దీనికి భిన్నమైన పాయింట్ ని లేవదీశారు ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్.

వినాయక్ చెప్తున్న దాని ప్రకారం… సాయి తేజ్ కొంతకాలంగా డైటింగ్ లో ఉన్నారు. ఫిట్నెస్ కోసం ఆయన ప్రత్యేకమైన నియమాలు పాటిస్తున్నారట. దాంతో, వీక్ నెస్ కారణంగా కళ్ళు తిరిగి పడి ఉంటారనేది వినాయక్ చెప్తున్నారు. సాయి తేజ్ రాష్ డ్రైవింగ్ చేసే వ్యక్తి కాదని, అలాగే రోడ్డుపై ఉన్న ఇసుక కూడా పెద్ద ప్రమాదకారమైనది కాదని వినాయక్ అంటున్నారు.

ఆ టైంలో నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడనేది వినాయక్ మాట. మీడియా దీన్ని పెద్ద రాద్ధాంతం చేయొద్దని కోరుతున్నారు వినాయక్.

మరోవైపు, సాయి తేజ్ నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఇప్పటికే కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ ఫుల్ గా జరిగింది. ఐతే, ఆయన పూర్తిగా కోలుకోవడానికి చాలా టైం పడుతుందట. ఇప్పటికీ ఆయన్ని ఐసీయూలోనే ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.

Advertisement
 

More

Related Stories