సత్యరాజ్ కి ఆసుపత్రిలో చికిత్స

తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు తమిళ చిత్రసీమలో కూడా కరోనా కేసుల కలవరం అధికంగా ఉంది. ఇప్పటికే కమల్ హాసన్, అర్జున్, విక్రమ్, వడివేలు వంటి నటులు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా త్రిష కోలుకొంటోంది.

మరో సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన వయసు రీత్యా ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. తెలుగులో ‘బాహుబలి’, ‘మిర్చి’ వంటి సినిమాలతో సత్యరాజ్ పాపులర్ అయ్యారు.

ఆయన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని అంటున్నారు.

దక్షిణాదిలో తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌, కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. తెలుగు చిత్రసీమలో ఇప్పటికే మహేష్ బాబు, తమన్ వంటి సెలబ్రిటీస్ తాజాగా కరోనా బారిన పడ్డారు.

Advertisement
 

More

Related Stories