 |
|
Late Sri S.Gopal Reddy |
" మా" గోపాల్ రెడ్డి గారు.
ఎస్. గోపాల్ రెడ్డి...... ఆ పేరు వింటేనే బాలయ్య అభిమానుల్లో వెయ్యు వోల్టుల విద్యుత్తు ప్రవహిస్తుంది ఎక్కడలేని ఉత్తేజానికి లోనవుతారు. అభిమాన హీరో సినిమా కి నిర్మాత అంటే ఇలా ఉండాలి అని చెప్పలనుకున్నప్పుదు ప్రతి బాలయ్య అభిమాని మదిలో మెదిలే మొదటి పేరు ఎస్. గోపాల్ రెడ్డి.
నెల్లూరుకు చెందిన ఎస్. గోపాల రెడ్డి గారు అగ్రికల్చర్ బి. ఎస్సి. చేసి చిత్ర రంగం మీద మమకారంతో, తన కుమారుని పేరు మీద భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే సంస్థని స్థాపించి రెండు మూడు చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించి భారీ విజయాలను స్వంతం చేసుకున్నారు. స్వతహాగా ఎన్.టి.ఆర్ గారి అభిమాని. ఆయనతో తియ్యలేక పోయినా, వారి అబ్బాయితో అయినా చిత్రం తియాలనే అభిలాషతో తమిళంలో భారతి రాజా గారు దర్శకత్వం వహించి ఎవరేజ్ గా నడిచిన చిత్రం రిమేక్ హక్కులని కొన్నారు. దానికి కథ కూడా భారతి రాజా గారే రాసుకున్నారు. బాలయ్యకి కథ నచ్చింది, కానీ ఒక్క సారి తన తండ్రి అభిప్రాయం కూడా తెలుసుకోవాలని ఎస్. గోపాల రెడ్డి గారిని వెంటబెట్టుకొని వెళ్లి వినిపించారు. ఎన్టీఅర్ గారి ఆశేస్సులతో తీసిన మంగమ్మ గారి మనవడు సృష్టించిన రికార్డ్స్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కడితో మొదలయున ఆ combination తెలుగు చలన చిత్ర సీమ కి మంగ్గమ్మ గారి మనవడు, ముద్దుల క్రిష్నయ్య, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు లాంటి మరపురాని విజయాలని అందించింది. ముద్దుల మావయ్య సృష్టించిన ప్రభంజనం ఇంతా అంతా కాదు. "దంచవే మేనత్త కూతురా" , "మావయ్య అన్న పిలుపు" లాంటి పాటలు ఇంక ఆంధ్ర దేశంలో ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంటాయు. "ముక్కు పుడక", "మనిషికో చరిత్ర" "మా పల్లెలో గోపాలుడు" "మన్నెంలో మొనగాడు" "మధురా నగరిలో" లాంటి మరెన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలని తెలుగు చలన చిత్ర సీమ కి అందించిన వ్యక్తీ ఎస్. గోపాల రెడ్డి గారు.
1994 లో వచ్చిన మాతో పెట్టుకోకు తర్వాత దాదాపు ఏడు సంవత్సరాల అనంతరం జానపద చిత్రం ప్రారంబించి అనివార్య కారణాల వలన ఆపేసిన అనంతరం దాదాపు మూడు సంవత్సరాల తర్వాత 2004 లో విజయేంద్ర వర్మ ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్నారు ఎస్. గోపాల్ రెడ్డి గారు. ఆ ఫంక్షన్ లో పాల్గొన్న మరో అభిమాని ప్రదీప్ మాటల్లో.......
ఎస్. గోపాల్ రెడ్డి ని డయాస్ మీదకి స్పీచ్ ఇవ్వమని పిలిచారు . అప్పటి వరకు ఆయన డయాస్ మీద లేరు. ఎస్ . గోపాల్ రెడ్డి పేరు వినపడిన దగ్గర నుంచి దాదాపు 5-6 నిముషాలు తుఫాను లాంటి హోరు తో ఫాన్స్ నినాదాలు చేసారు.. నిజంగా చెప్పాలంటే బాలయ్య బాబు స్పీచ్ కి వచ్చినప్పటికంటే ఎక్కువ నినాదాలు చేసారు. చాలా years తర్వాత బాలయ్య
ఫాన్స్ - ఎస్. గోపాల్ రెడ్డి ని పబ్లిక్ ఫంక్షన్ లో మీట్ అయ్యారు. ఆ కసి జనాల్లో బాగా కనిపించింది. ఆ అభిమానుల అభిమానం చూసి ఎస్. గోపాల్ రెడ్డి ఎడ్చేసారు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆయనకీ ప్లస్ చాలా మంది ఫాన్స్ కి కూడా...
హీరో కి అభిమాని కి మద్య ఉండే సంబంధాల గురించి ఎన్నో విన్నాము మరెన్నో చూసాము. అయుతే అభిమానులకి నిర్మాతకి మద్య కూడా ఎమోషనల్ అట్టాచ్మెంట్ (emotional attachment) ఉంటుందని చెప్పటానికి ఈ సంఘటన ఒక చిన్న ఉదాహరణ.
బాలయ్య గారి తో తీస్తూ ఆగిపోయున జానపద చిత్రం కోసం వైజాగ్ లో భారీ సెట్టింగ్స్ వేసారు భార్గవ్ స్టూడియోస్ పేరుతొ. వాటికి వచ్చిన నష్టం గురించి ఎవరయునా మాట్లాడితే ఆ సినిమా కోసం అక్కడ ల్యాండ్ కొన్నాను సినిమా ఆగింది అయుతే పక్కనే గంగవరం పోర్ట్ వచ్చింది నా లాండ్స్ వేల్యూ కొన్ని కోట్లకి చేరింది వాటిలో గోడవున్స్ కట్టి షిప్పింగ్ కంపెనీస్ వాళ్ళకి రెంట్స్ కి ఇవ్వాలనుకుంటున్నాను. బాలయ్య తో సినిమా చేస్తే నాకు నష్టం వచ్చే సమస్యే లేదు ఏదో ఒక రూపంలో నాకు లాభమే అని చెప్పగల్గిన సహృదయుడు మా ఎస్. గోపాల్ రెడ్డి. బాలయ్య గారు చెన్నైలో ఉన్నప్పుడు చూడటానికి వచ్చే అభిమానులకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి ఎస్. గోపాల రెడ్డి గారు. నిర్మాతలు చాలా మంది వారసులని తెస్తున్నారు మీకు ఏమయునా అలాంటి ప్లాన్ ఉందా? అని అడిగితె కాకి పిల్ల కాకికి ముద్దు ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి అని ఘంటాపతంగా చెప్పిన వ్యక్తి ఎస్ గోపాల్ రెడ్డి గారు.
2006 జనవరి లో మొదటిసారిగా కలిసాను ఎస్. గోపాల్ రెడ్డి గారిని, అప్పటికే ఆయన కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. నేను ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తే మీ లాంటి అభిమానులు ఉన్నంత కాలం నాకొచ్చిన ప్రాబ్లం ఏమి లేదు అని చెప్పారు. ఆయన చూపించిన ఆదరాభిమానాలు జన్మలో మరువలేనివి. మళ్ళి జూన్ లో కలిసాను ఇలా ఎప్పుడు ఇండియా వెళ్ళినా ఎస్. గోపాల్ రెడ్డి గారిని కలవటం అనేది తప్పనిసరి. చివరిసారిగా బాలయ్య గారి అమ్మాయు పెళ్లి లో కలిసి చాలా సేపు మాట్లాడాను. అదే చివరి సారి కలవటం అవుతుందని అనుకోలేదు.
అటు బాలయ్య గారు ఇటు ఎస్. గోపాల్ రెడ్డి గారు మరో కొత్త సినిమా తీద్దామని గత 2,3 సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అనివార్య కారణాలవల్ల కార్య రూపం దాచలేదు అంతలోనే ఈ దుర్వార్త.
సునామీ ని దగ్గరగా చూసిన వ్యక్తి ఎస్. గోపాల్ రెడ్డి గారు. మంచివాళ్ళని దేవుడు ఎప్పుడు తొందరగా తీసుకెళ్తాడు. పుట్టిన వాడు గిట్టక తప్పదు, అలాగే గిట్టిన వాడు జన్మించక తప్పదు అన్నారు గీతలో శ్రీ కృష్ణుడు.
ఈ ఆర్టికల్ ని ఎస్. గోపాల్ రెడ్డి గారి అమ్మాయు, అబ్బాయు తప్పక చదువుతారని ఆశిస్తూ ఎస్. గోపాల్ రెడ్డి గారికి ఉన్న లక్షలాది అభిమానుల ఆశీస్సులు, అండదండలు ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని ఆ కుటుంబానికి దీవెనలు అందజేయ్యమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ...
రవి పొట్లూరి, ఫిలడేల్పియా, యు.ఎస్. ఏ