సినీ కార్మికులకు మెగా వాక్సిన్ డ్రైవ్

CCC

గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసింది కరోనా క్రైసిస్ ఛారిటి. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం సోమవారం ఉదయం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో మొదలైంది. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు.

“కరోనా క్రైసిస్ చారిటి కింద ఈ రోజు సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికీ, ఫిలిం ఫెడరేషన్ వారందరికీ, అలాగే వారితో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్నీ కూడా ఇందులో చేర్చడం జరిగింది. ఫిలిం జర్నలిస్ట్ లకు కూడా వాక్సిన్ ఇస్తున్నాం. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు, అపోలో 24 / 7ల సహకారంతో ఈ వాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం అయింది. పునః ప్రారంభం ఎందుకన్నానంటే… నిజానికి ఇది మూడు వారల క్రితమే మొదలైంది. అయితే వాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఇక ఈ వాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో ఎంతమంది ఉంటే.. .. అందరికి వాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నాం,” అని చిరంజీవి చెప్పారు.

“ఇప్పటికే వేలమంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కనీసం రోజుకు ఐదారు వందల మందికి వాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. తప్పకుండా సినీ కార్మికులందరూ వాక్సిన్ తీసుకోవాలి. సీసీసీ చారిటి మొదలెట్టినప్పుడు హీరోలు,నిర్మాతలు, దర్శకులు అందరూ ముందుకొచ్చి డొనేషన్స్ ఇచ్చారు దానికి తగ్గట్టుగా సీసీసీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పైసా కూడా అవసరం ఉన్నవాళ్లకు చేరేలా చర్యలు తీసుకుంటాం. దానికి నేను భరోసా,” అని చిరంజీవి అన్నారు.

అలాగే తాను ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్నాను అని చెప్పారు మెగాస్టార్. “నేను వాక్సిన్ తీసుకున్నాను. తప్పకుండా అందరు వాక్సిన్ తీసుకుని కరోనా రాకుండా చేద్దాం,” అని చిరంజీవి పిలుపునిచ్చారు.

Advertisement
 

More

Related Stories