‘టెనెట్’తో హైద్రాబాద్ మల్టిప్లెక్స్ లు షురూ

Tenet

9 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ ల్లో ఆటలు మొదలయ్యాయి. హాలీవుడ్ మూవీ “టెనెట్” ఈ రోజు విడుదలయింది. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ వంటివి ఈ రోజు నుంచి తెరుచుకున్నాయి. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాడు. ప్రసాద్స్ మల్టిప్లెక్స్ కి మార్నింగ్ “టెనెట్” సినిమా చూడ్డానికి వెళ్ళాడు. అంతేకాదు, ఆ వీడియోని కూడా షేర్ చేశాడు.

సాయి ధరమ్ తేజ్ నటించిన “సోలో బ్రతుకే సో బెటర్”తోనే తెలుగు సినిమాల రిలీజ్ లు మొదలవుతాయి. ఈనెల 25న విడుదల కానుంది ఈ మూవీ. సాయి తేజ్ ముందడుగు వేస్తున్నాడు.

“టెనెట్” సినిమా అమెరికాలో పెద్దగా ఆడలేదు. కానీ వేరే దేశాల్లో బాగానే ఆడింది. మన దగ్గర అడ్వాన్స్ బుకింగులు బావున్నాయి. జనం మెల్లమెల్లగా థియేటర్లకు వచ్చేందుకు ఇలాంటి సినిమాలు ఉపయోగపడుతాయి. థియేటర్ బిజినెస్ పునర్ వైభవం చూడాలంటే చాలా టైం పడుతుంది.

Advertisement
 

More

Related Stories