లక్ష్మీప్రసన్నలో మొదటిసారి లక్ష్మి!

మోహన్ బాబు తన కూతురు లక్ష్మీప్రసన్న పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించి ఎన్నో బ్లాక్ బస్టర్స్ నిర్మించారు. ఆ తర్వాత నిర్మాణ సంస్థ బాధ్యతలను మంచు విష్ణు తీసుకున్నారు. ఈ సంస్థ విష్ణుతో, మోహన్ బాబుతో, మనోజ్ తో సినిమాలు తీసింది కానీ లక్ష్మి ప్రసన్నతో ఇప్పటివరకు నిర్మించలేదు.

మొదటిసారిగా ఆమె తన పేరుమీద పెట్టిన బ్యానర్లో నటిస్తోంది. ఆ చిత్రం ఈ రోజు (ఫిబ్రవరి 12) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యింది.

తండ్రి మోహన్ బాబుతో కలిసి నటించనుండడం కూడా ఇదే మొదటిసారి. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ళు ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహించబోతున్నారు.

“వచ్చే నెల రె గ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం” అని చెప్పారు మేకర్స్.

Advertisement
 

More

Related Stories