సుశీల పేరిట పోస్టల్ స్టాంప్

P Susheela


లెజండరీ గాయని పి.సుశీలకి అరుదైన గౌరవం దక్కింది. పి.సుశీల పేరిట పోస్టల్ శాఖ ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు.

తన పేరిట పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసినందుకు సుశీల పోస్టల్ శాఖకి కృతఙ్ఞతలు తెలిపారు. వేల పాటలు పాడిన మహా గాయని సుశీలకి ఇప్పుడు 86 ఏళ్ళు. 2008లో కేంద్ర ప్రభుత్వం ఆమెని పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది.

విజయనగరంలో జన్మించిన సుశీల చిన్న వయసులోనే మద్రాస్ వెళ్లి గాయనిగా నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

Advertisement
 

More

Related Stories