మహాసముద్రం ట్రెండ్ సెట్టర్ అవుతుంది: సిద్దార్ధ్


చాలా గ్యాప్ తర్వాత హీరో సిద్ధార్థ్ తెలుగులో నటించారు. ‘మహా సముద్రం’ సినిమాలో శర్వాతో పాటు సిద్ధార్థ్ ఒక హీరోగా నటించారు. ఈ నెల 14న విడుదల కానుంది ‘మహాసముద్రం’. రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో సిద్ధార్థ్ చెప్పిన ముచ్చట్లు…

  • “అజయ్ భూపతి కథ చెప్పగానే ఓకే చెప్పేశా. కథ అంతగా నచ్చింది. ఇది ట్రెండ్ సెట్టర్ అవుతుంది. సిద్దు అంటే చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అనే ఇమేజ్ ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు. ‘మహాసముద్రం’తో కొత్త ఇమేజ్ వస్తుంది.”
  • “శర్వానంద్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. 12 ఏళ్ల క్రితం నన్ను సినిమాల గురించి ఎక్కువగా ప్రశ్నలు అడిగేవాడు. ఇప్పుడు, నాకు ఆ బాధ లేదు. తాను ఎదిగాడు, అద్భుతమైన సినిమాలు చేశాడు.”
  • “ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. అజయ్ భూపతి అలా తీశాడు.”
  • “తెలుగు సినిమా ఇండస్ట్రీని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. పోలేను. కొంత గ్యాప్ వచ్చింది కానీ తెలుగు హీరోనని గర్వంగా చెప్పుకుంటా. ఇకపై తెలుగు ప్రేక్షకులను వదిలిపెట్టి వెళ్లను. త్వరలోనే మరో రెండు సినిమాలు అనౌన్స్ చేస్తాను.”
  • “అవును మా ఎన్నికల్లో ఓటు వేస్తాను. నేను సభ్యుడినే. నాకు నచ్చిన వారికే ఓటు వేస్తాను.”
  • “రాజకీయాల గురించే కాదు దేని గురించి అయినా నిజాలు ధైర్యంగా చెపుతా. నా మాటల వల్ల కలిగే పర్యవసనాలను ఎదుర్కొంటా. రాజకీయాల్లోకి అడుగుపెడుతానో లేదో ఇప్పుడే తెలియదు.”
Advertisement
 

More

Related Stories