యువీ ఇక ఎప్పటికీ మారదా?

Ee Raathale


‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్ ఒక ప్రహసనంగా మారింది. అదేంటో గానీ యువీ క్రియేషన్స్ సంస్థ ‘రాధేశ్యామ్’ సినిమా విషయంలో అన్ని తప్పులే చేస్తోంది. ఈ సంస్థ అంటే ప్రభాస్ అభిమానులకు పిచ్చ కోపం. ఇప్పటికే అనేక సార్లు యువీకి వ్యతిరేకంగా, ఆ సంస్థ పీఆర్వోలకు వ్యతిరేకంగా ప్రభాస్ అభిమానులు నెగెటివ్ ట్రెండింగ్ చేశారు. అయినా మారట్లేదు వాళ్ళు.

నిన్న మొదటి పాట విడుదల చేస్తామని చెప్పి కూడా పిచ్చి పిచ్చిగా బెహేవ్ చేసింది ‘రాధేశ్యామ్’ టీం.

5 గంటలకు పాట వస్తోందహో అంటూ రెండు రోజులు సోషల్ మీడియాలో క్యాంపెన్ రన్ చేశారు. యాజ్ యూజువల్ గా 5 గంటలకు హ్యాండ్సప్. పాట రాలేదు. అభిమానులు ట్విట్టర్లో గోల గోల చేశారు. కొందరు హైదరాబాద్ సిటీ పోలీస్ కి టాగ్ చేస్తూ యువి క్రేయేషన్స్ టీంని అరెస్ట్ చెయ్యమని పోస్ట్ చేశారు. ఆ రేంజులో హంగామా జరిగింది.

ఆ తర్వాత సాకేంతిక కారణాల వల్ల 8 గంటలకు అప్లోడ్ చేస్తామని చెప్పింది టీం. సీన్ మారలేదు. 8 గంటలకు కూడా రాలేదు. 9 గంటల ప్రాంతంలో టీ సిరీస్ సంస్థ యూట్యూబ్ లో పాట పెడితే టకా టకామని మీడియా హ్యాండిల్స్, అభిమానులు షేర్ చేశారు. ఆ తర్వాత తాపీగా యువీ టీం నిద్ర లేచి…షేర్ చేసింది.

ఐతే, గుడ్డిలో మెల్ల విడుదలైన ఆ పాట బాగుంది. ‘డియర్ కామ్రేడ్’లో కూడా మంచి పాటలు ఇచ్చిన యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ మంచి మెలోడీ సాంగ్ ఇచ్చాడు. దాంతో అభిమానులు చల్లబడ్డారు.

Advertisement
 

More

Related Stories