హీరోయిన్లు అటు.. హీరోలు ఇటు

Tollywood Stars vacation

ఓవైపు హీరోయిన్లంతా మాల్దీవులకు క్యూ కడుతుంటే.. హీరోలు మాత్రం ఛలో దుబాయ్ అంటున్నారు. రకుల్, తాప్సి, మెహ్రీన్, ప్రణీత, శాన్వి, కాజల్.. ఇలా చాలామంది హీరోయిన్లు మాల్దీవులకు వెళ్లొచ్చారు. మహేష్, ఎన్టీఆర్ లాంటి హీరోలు మాత్రం దుబాయ్ కు ఓటేస్తున్నారు.

Advertisement

మహేష్ ఆల్రెడీ దుబాయ్ వెళ్లొచ్చాడు. కుటుంబసమేతంగా దుబాయ్ వెళ్లిన సూపర్ స్టార్, కొన్ని రోజుల పాటు అక్కడ రిలాక్స్ అయ్యాడు. మహేష్ తర్వాత ఎన్టీఆర్ కూడా దుబాయ్ వెళ్లాడు. కుటుంబంతో పాటు దుబాయ్ వెళ్లి వచ్చాడు తారక్. ఇప్పుడీ లిస్ట్ లోకి నితిన్ కూడా చేరిపోయాడు.

లాక్ డౌన్ కారణంగా పెళ్లి తర్వాత హనీమూన్ కు వెళ్లలేదు నితిన్. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు పరిమితమైపోయాడు. ఇన్నాళ్లకు నితిన్ కు కాస్త టైమ్ దొరికింది. దీంతో తన భార్యను తీసుకొని దుబాయ్ వెళ్లాడు ఈ హీరో. నిజానికి అతడు చేస్తున్న ఓ సినిమా షూటింగ్ ను దుబాయ్ లో ప్లాన్ చేశారు. అది పూర్తయిన తర్వాత భార్యతో కొన్ని రోజులు అక్కడే ఉండి హైదరాబాద్ వస్తాడు నితిన్.

ఈ లిస్ట్ లో నాగచైతన్య మాత్రం మిస్సయ్యాడు. భార్య సమంతతో కలిసి మల్దీవులకు వెళ్లాడు. నిజానికి వీళ్లిద్దరి ఫేవరెట్ స్పాట్ గోవా. కానీ ఈసారి మాత్రం మాల్దీవుల్లో ల్యాండ్ అయింది ఈ జంట.

Advertisement
 

More

Related Stories