‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’ చిత్రాలతో సంచలనం సృష్టించిన వరుణ్ సందేశ్ రీసెంట్ గా రేసులో లేకుండా పోయాడు. గత దశాబ్ద కాలంలో ఒక్క హిట్ లేదు. మొన్నటి వరకు చిన్నదో, పెద్దదో అనుకుంటూ హీరోగా కనిపించాడు. ఇప్పుడు మేటర్ అర్థం అయింది. సో సైడ్ రోల్స్ లోకి వచ్చాడు.
సందీప్ కిషన్ హీరోగా రూపొందుతోన్న ‘మైఖేల్’ అనే చిత్రంలో ఒక కీలకమైన పాత్రని పోషించనున్నాడు వరుణ్ సందేశ్. తమిళ్ హీరో విజయ్ సేతుపతి కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలోకి వరుణ్ సందేశ్ కూడా వచ్చి చేరాడు. మైఖేల్ చిత్రం షూటింగ్ తాజా షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ షూటింగ్ లో వరుణ్ జాయిన్ అయ్యాడు.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది.
వరుణ్ సందేశ్ సరైన నిర్ణయం తీసుకున్నాడు. హీరోగానే కంటిన్యూ అవడం కన్నా ఎదో ఒక పాత్రలో కనిపించడమే బెటర్. అలా బిజిగా ఉండొచ్చు.