క్లోజ్ ఐతే ప్రభాస్ చెలరేగిపోతాడట

ప్రభాస్ కి సిగ్గు ఎక్కువ…హీరోయిన్లతో ఎక్కువగా మాట్లాడడు అని అనుకుంటారు. మీడియాతో కూడా ఇంటరాక్ట్ అయ్యేందుకు పెద్దగా ముందుకురాడు ప్రభాస్. ఐతే, అది నిజం కాదంటోంది కృతి సనాన్. ఆమె ఇటీవల ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపిస్తుండగా, జానకిగా కృతి నటిస్తోంది. కృతి తన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసింది.

“ప్రభాస్ సిగ్గరి కాదు. కొత్తవాళ్లతో మాట్లాడడు. ఎవరితో అయినా ఫ్రెండ్లిగా ఉంటారు. సెట్ లో చిన్నా పెద్దా అందర్నీ గౌరవిస్తారు. ఐతే, ఆయనతో మనం కొంత క్లోజ్ అయితే కానీ మాటలు కలపరు. చనువు ఏర్పడాలి. అప్పుడు చెలరేగిపోతాడు,” అని చెప్పింది కృతి.

‘ఆదిపురుష్’ షూటింగ్ టైంలో ప్రభాస్ తో మంచి స్నేహం ఏర్పడింది అని చెప్తోంది కృతి. పెద్ద సూపర్ స్టార్ అయినా ఎటువంటి టెక్కు చూపని జెంటిల్ మేన్ అని పొగడ్తలతో ముంచెత్తింది కృతి.

ఈ భామ ఇంతకుముందు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించింది.

Advertisement
 

More

Related Stories