కత్తి కార్తీకపై పోలీస్ కేసు

యాంకర్ కత్తి కార్తీకపై ఛీటింగ్ కేసు నమోదైంది. సదరు యాంకర్ తనను మోసం చేసిందంటూ దొరస్వామి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇంతకీ మేటర్ ఏంటంటే..

టచ్ స్టోన్ ప్రాపర్టీ డెవలపర్స్ అనే సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నాడు దొరస్వామి. వ్యాపార విస్తరణలో భాగంగా భారీ అపార్ట్ మెంట్ నిర్మించాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కత్తి కార్తీక, వేరే వ్యక్తి సాయంతో దొరస్వామిని కలిసింది.

అమీన్ పూర్ వద్ద ఎకరాల స్థలం ఉందని.. అందులో తనకు కూడా వాటా ఉందని నమ్మించింది. ఈ క్రమంలో వాటాదారులుగా మరో ఐదుగుర్ని కూడా పరిచయం చేసింది. డెవలప్ మెంట్ కోసం స్థలాన్ని 35 కోట్లకే ఇప్పిస్తామని, కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోరారు.

వీళ్ల మాటలు నమ్మిన దొరస్వామి, కార్తీక చెప్పిన వివిధ ఎకౌంట్స్ కు కోటి రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశాడు. అయితే అంతలోనే ఆ స్థలానికి కత్తి కార్తీకకు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్నాడు. దీంతో కార్తీక తనను మోసం చేసిందంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై, ఆమె స్నేహితులపై ఫిర్యాదు చేశాడు. 

Advertisement
 

More

Related Stories