మొదటి బోణి ఆలియాదే!

Gangubai


బాలీవుడ్ పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. వచ్చే నెల నుంచి వచ్చే ఏడాది దీపావళి వరకు లైనప్ రెడీ అయింది. ఐతే, 2022లో మొదటి బోణి మాత్రం బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ దే.

ఆమె ప్రధానపాత్రలో మహాదర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీసిన చిత్రం.. “గంగూబాయి కతియావాడి”. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి చాలాకాలమే అయింది. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 6, 2022న రిలీజ్ చేస్తామని ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. అంటే 2022లో మొదట విడుదలయ్యే మూవీ ఇదే.

ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్‌ జైదీ రచించిన “మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై” అనే బుక్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా భట్‌ వేశ్య గృహం నడిపే యజమానురాలుగా నటిస్తోంది.

ఇక సంక్రాంతికి “ఆర్ ఆర్ ఆర్” కూడా విడుదలైతే, అలియా భట్ వరుసగా రెండు సినిమాలను వారం గ్యాప్లోనే విడుదల చేసినట్లు అవుతుంది.

Advertisement
 

More

Related Stories