ఒకటి క్లారిటీ, మరి ఇంకోటి?

Sai Pallavi

ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసింది సాయి పల్లవి. కానీ, కోవిడ్ 19 అంతా తారుమారు చేసింది. ఆమె నటించిన ‘లవ్ స్టోరీ’, ‘విరాట పర్వం’ చిత్రాలు విడుదల డేట్ కోసం చాలా నెలలుగా నిరీక్షిస్తున్నాయి. ఇప్పుడు ఒక సినిమా విషయంలో క్లారిటీ వచ్చింది.

శేఖర్ కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ విడుదల తేదీ ఖరారు అయింది. సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ఇది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ‘సారంగ దరియా’ పాట విపరీతంగా వైరల్ అయింది. సాయి పల్లవికి మరో ఫిదా అయ్యే అవకాశం ఉంది.

ఇక, రానాతో కలిసి నటించిన ‘విరాటపర్వం’ మాత్రం థియేటర్లోకి వస్తుందా అన్నది డౌటే. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ కి ఆల్రెడీ ఇచ్చేశారని టాక్. కానీ మేకర్స్ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. అందుకే, సాయి పల్లవి రెండు సినిమాల్లో ఒక దాని గురించే స్పష్టత వచ్చింది.

సాయి పల్లవి ఈ రెండు విడుదలైన తర్వాత కొత్తగా తెలుగులో సినిమాలు ఒప్పుకుంటుందట. పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ వస్తే కాదనుకొంది సాయి పల్లవి.

Advertisement
 

More

Related Stories