20 ఏళ్ల తర్వాత కలిశారు!

Anshu

నాగార్జున కెరీర్లో సూపర్ హిట్ మూవీ… మన్మథుడు. ఈ సినిమాలో సోనాలి బెంద్రే హీరోయిన్. ఐతే, సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అన్షు హీరోయిన్ గా నటించింది. ఆమెకి ఈ సినిమా బాగా పేరు తెచ్చింది. కానీ తెలుగులో మరో రెండు సినిమాల్లో నటించి లండన్ వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడింది.

ఇన్నేళ్ల తర్వాత ఆమె హైదరాబాద్ కి వచ్చింది. హైదరాబాద్ లో ఆమె స్నేహితులు ఇచ్చిన పార్టీకి నాగార్జున, అమల హాజరయ్యారు. ఇన్నేళ్ల తర్వాత ఈ పార్టీలో మన్మథుడు జంట నాగార్జున, అన్షు మీట్ అయ్యారు. తాము కలిసి నటించిన మెమొరీస్ షేర్ చేసుకున్నారు. ఆమె ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

అన్షు అసలు పేరు అన్షు అంబానీ. పెరిగింది లండన్ లోనే. “మన్మథుడు” విడుదలయ్యాక ఆమె ప్రభాస్ సరసన “రాఘవేంద్ర” అనే సినిమాలో నటించారు. భూమిక హీరోయిన్ గా రూపొందిన “మిస్సమ్మ”లో కూడా చిన్న పాత్ర పోషించారు. ఈ మూడు సినిమాల తర్వాత ఆమె భారతీయ సంతతికి చెందిన సాగర్ అనే లండన్ వ్యాపారవేత్తని పెళ్లాడింది. వీరికి ఒక కూతురు.

22 ఏళ్ల పాటు ఆమె సినిమాలకు దూరంగానే ఉంది. హైదరాబాద్ కి కూడా ఎక్కువగా రాలేదు. ఐతే ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది బహుశా మళ్ళీ నటించే ఆలోచనలో ఉందేమో.

Advertisement
 

More

Related Stories