డేట్లన్నీ తారుమారు అవుతాయా!

Sebastian


‘భీమ్లా నాయక్’ పిడుగులా వచ్చిపడింది. ఏప్రిల్ 1న విడుదల అవుతుంది అనుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 అంటూ నిన్న రాత్రి ప్రకటించారు మేకర్స్. ఆ ఒక్క ప్రకటనతో తెలుగు సినిమాల విడుదల షెడ్యూల్ మొత్తం తారుమారు అయ్యేలా ఉంది.

ఫిబ్రవరి 25 నుంచి ‘భీమ్లా నాయక్’ తప్పుకుందనే ఉద్దేశంతో శర్వానంద్ తన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాన్ని ఆ డేట్ కి రెడీ చేస్తున్నారు. సినిమా ప్రొమోషన్ కూడా మొదలైంది. వరుణ్ తేజ్ కూడా ‘గని’ని అదే డేట్ కి ఫిక్స్ చేశారు. ఇప్పుడు వరుణ్ తేజ్ మార్చికి వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. కానీ శర్వానంద్ మాత్రం ఒక రోజు లేటుగా ఫిబ్రవరి 26న వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు టాక్.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ప్రకారం కొత్త డేట్స్ ఇలా ఉండనున్నాయి.

ఆడవాళ్లు మీకు జోహార్లు – ఫిబ్రవరి 26, ఏప్రిల్ 8
గని – మార్చి 4
రాధేశ్యామ్ – మార్చి 11
సెబాస్టియన్ పీసీ 524 – మార్చి 17
ఆర్ ఆర్ ఆర్ – మార్చి 25

Advertisement
 

More

Related Stories