మూడో పెళ్లి పెటాకులే… ఒప్పుకున్న వనిత

Vanitha Vijaykumar

తన మూడో భర్త పీటర్ పాల్ కి దూరంగా ఉండాలని డిసైడ్ అయింది వనితా విజయ్ కుమార్. అంతేకాదు, తన మూడో భర్త మొదటి భార్య నుంచి క్షమాపణలు కోరుతోంది వనిత. ఆమెకి తాను అన్యాయం చేశాను అని, తన తప్పుకు క్షమించండి అంటూ వేడుకుంటోంది. తన కొడుకు ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్పినా కూడా వినలేదు ఆమె. ఇప్పుడు తీరిగ్గా మూడోసారి కూడా పెళ్లి విషయంలో తప్పు చేశాను అంటోంది.

లాక్డౌన్ కాలంలో హడావిడిగా పెళ్లి చేసుకొంది వనిత. పీటర్ పాల్ అనే ఒక మూవీ గ్రాఫిక్స్ టెక్నీషియన్ ని పెళ్లాడింది. ఆయన తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వలేదు. పీటర్ మొదటి భార్య ఎలిజిబెత్ … వనితా విజయ్ కుమార్ కి వ్యతిరేకంగా కేసు వేసింది. ఐనా, పెడచెవిన పెట్టి జూన్ 27న చెన్నైలోని తన సొంత ఇంట్లో పెళ్లి చేసుకొంది వనిత.

పెళ్ళైన కొన్నాళ్లకే అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది. బాగా తాగడం వల్లే ఈ సమస్య వచ్చింది అని డాక్టర్లు చెప్పారు. అతని తాగుడుకి బానిస అని ఇండస్ట్రీలో అందరూ చెప్పారు కానీ ఆమె వినలేదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తాగడం మానేసాను అంటూ ఒట్టు వేసి చెప్పాడట.

కానీ కూడా ఆమెకి తెలీకుండా తాగడం స్టార్ట్ చేశాడట. ఇటీవల వీరు అంతా గోవా వెళ్లారు. గోవా ట్రిప్ లో రోజంతా తాగుతూనే ఉన్నాడట. దాంతో… వనిత అతనితో గొడవపడి… ఇంట్లో నుంచి తరిమేసింది. ఈ మేటర్ అంతా ఇప్పటికే మీడియాలో వచ్చింది.

తాజాగా ఆమె ఒక వీడియో విడుదల చేసింది. అందులో సుదీర్ఘంగా ఈ విషయాలు బయట పెట్టింది. ఎలిజబెత్ తనని క్షమించాలని కన్నీళ్ల పర్యంతమైంది.

Advertisement
 

More

Related Stories